Home / జాతీయం
కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా టీకా వల్ల సంభవించిన మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని వివరించింది.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాధ్ జిల్లాలో ఉన్న ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం నిఖా అనగా పెళ్లిళ్లలో డ్యాన్సులు చెయ్యడం, పెద్ద శబ్ధంతో మ్యూజిక్ పెట్టడాన్ని నేరంగా పరిగణిస్తూ వాటిపై నిషేధం విధించారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ వరుసగా ఆరవ రోజు కూడా పనిచేయలేదు.
రాహుల్ గాంధీ తన గడ్డం గీసుకుంటే భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలా కనిపిస్తారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
యూపీ బస్తీ జిల్లాలో 9 ఏళ్ల బాలుడిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ ఎస్ యు వి ఢీకొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
డిసెంబర్ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్లో బ్యాంక్లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
మధ్యప్రదేశ్లోని మోవ్లో మోటార్సైకి నడిపిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం ఇండోర్లో తన భారత్ జోడో యాత్రలో సైకిల్ తొక్కారు.
మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా గతవారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మహిళాసంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యాఖ్యలపై రాందేవ్ మహిళలకు క్షమాపణలు తెలిపారు.
పంజాబ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటూ ఉన్న నలుగురు చిన్నారులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది.