Home / జాతీయం
PM Narendra Modi in Maharashtra elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గురువారం ఛత్రపతి శంభాజీ నగర్లో అధికార కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రతిపక్ష కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ విభజనను నమ్ముతోందన్నారు. కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోవడం లేదన్నారు. […]
Peddpalli Train Accident: పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి-రామగుండం మధ్య రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తాపడింది. ఐరన్ కాయిల్స్తో ఓ రైలు ఓవర్లోడ్లో వెళ్తున్నది. దీంతో 11 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింక్లు తెగిపోవడంతోపాటు ఒకదానిపై మరో బోగి పడి మూడు ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 53 రైళ్లను […]
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీపై బీజేపీ అగ్రనేతలు విమర్శలు పదునెక్కాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మహా వికాస్ అఘాడీపై ఫైర్ అయ్యారు. ఎంవీఏ కూటమి నేతలంతా ఔరంగజేబు అభిమానుల సంఘం నాయకులు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని ధూలేలో బుధవారం జరిగిన బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో షా ప్రసంగించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన తండ్రి బాల్ థాక్రే సిద్ధాంతాలను మరచిపోయారని […]
Most Powerful Leaders In India: దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. 2024 దేశంలోని రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి, సామార్థ్యాలపై ఇండియా టూడే సర్వే నిర్వహించింది. తాజాగా ఇండియా టుడే ఈ సర్వేను ప్రకటించగా.. దేశంలో రాజకీయంగా మోదీ శక్తివంతమైన నాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్షా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఉన్నట్టు ఇండియా […]
Justice Sanjiv Khanna takes oath as 51st Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా తదితరులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగియగా, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ […]
Manipur attacking Army camp: మణిపుర్లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్ స్టేషన్పై దాడులకు తెగబడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు కొందరు గాయపడ్డారు. జకురాడోర్ కరోంగ్లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. […]
Maharashtra Assembly Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తోండగా.. బీజేపీ కూడా గెలిచేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’పేరుతో దీనిని విడుదల చేసి ప్రతిపక్ష […]
Central Home Minister Amit Shah in Jharkhand: ఝార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం దేశంలోని అత్యంత అవినీమయ సర్కారుగా మారిందని, వారిని గద్దెదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఝార్ఖండ్ లోని పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమన్నారు. ఎన్ని తరాలు వచ్చి అడిగినా .. […]
India did world a favour by buying Russian oil: రష్యా నుంచి చమురు కొంటుంటే అందరూ నిందించారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒకవైపు రష్యాలో యుద్ధం జరుగుతోంది. అక్కడ పశ్చిమ దేశాల ఆంక్షలు మరోవైపున్నాయి. అయినా వాటిని లెక్క చేయకుండా మనం కొన్నాం కాబట్టి, ప్రపంచానికెంతో మేలు చేశామని అన్నారు. భారత్ అలా చేసి ఉండకపోతే నేడు చమురు ధరలు అంతర్జాతీయంగా మండిపోయేవని […]
Big Fight In Jammu Kashmir Assembly: భారతదేశానికే కాదు, ప్రపంచానికంతంటికి షాక్ ఇచ్చిన ఆర్టికల్ 370పై జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆర్టికల్ 370 పునరుద్దరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో బీజేపీ సభ్యులు ఆ తీర్మాన ప్రతులను చించి శాసన సభ వెల్ లోకి విసిరారు. ఈ మధ్యలో అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ […]