Home / జాతీయం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం మధ్యప్రదేశ్లో పర్యటించి నర్మదా పూజలు చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఉన్నారు.కర్ణాటకలో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో లైట్లను అమర్చిన ఇనుప స్తంభం ప్రమాదవశాత్తూ మీదపడింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్జాయ్’ తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఈ తుపాను తీరం వైపు కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబై ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 34 మంది మరణించగా.. సుమారు 150 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. వర్షాల
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను అందించాలని ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరినట్లు సమాచారం.
అమృత్సర్ నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగాపాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం భారత విమానం శనివారం రాత్రి 7:30 గంటలకు లాహోర్కు ఉత్తరాన ప్రవేశించి రాత్రి 8:01 గంటలకు భారతదేశానికి తిరిగి వచ్చినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది.
పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని ఆదివారం 10% పెంచింది, దీనితో రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు మరియు 88 పైసలు పెరిగాయి.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ఇటీవలి నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చిత్రాలు మరియు వీడియోలను ప్రసారం చేయడాన్ని నిషేధించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సస్పెన్షన్ను పొడిగించింది.