Home / జాతీయం
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవారం హైవేపై ఉన్న హోటల్లోకి ట్రక్కు దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.రాష్ట్ర రాజధాని ముంబయ్ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
ఉద్యోగాల కోసం భూములు కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది.ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ అజిత్ పవార్ మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్సీపీ శ్రేణులు పార్టీ అధినేత శరద్ పవార్కు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఇ-మెయిల్ కూడా పంపినట్లు పాటిల్ తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ ( సీఆర్ఎస్ ) నివేదిక తేల్చి చెప్పిందని తెలుస్తోంది. దీనితో ఈ ప్రమాదం వెనుకు ఎటువంటి కుట్ర లేదని స్పష్టమయింది.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ప్లయింగ్ జోన్లో డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఎస్పీజీ సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పంచుకోనున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున దుబాయ్ లో తాను మూడు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. కేజ్రీవాల్ కు రాసిన ఒక లేఖలో అతను ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
West Bengal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల కోసం పెద్ద రచ్చే నడుస్తోంది. ఎవరి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న సందేహంతో పలువురి పేర్లను పరిశీలిస్తోంది కేంద్రం. ఇకపోతే ఓ రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తోంది.
Congress Jana Garjana Sabha: కొద్దినెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపుతురుగుతున్నాయి. కేంద్రం తెలంగాణపై దృష్టి సారించి ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కాషాషజెండా ఎగురవెయ్యాలని భావిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వాళ్లకే గ్యాంరటీ లేని వారు కొత్త కొత్త గ్యారంటీలతో పాటు కొత్త స్కీంలతో హామీలను ఇస్తున్నారని మోదీ అన్నారు.