Home / జాతీయం
తన స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై నెలల తరబడి అత్యాచారం చేసి గర్భం దాల్చినందుకు ఢిల్లీలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రభుత్వ అధికారిపై ఆదివారం కేసు నమోదైంది. అతడినిఅరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రభుత్వ అధికారి నివాసానికి చేరుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జైలర్". ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది.
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు మరియు సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్లో మంగళవారం మరణించారు. 80 ఏళ్ల పాఠక్ భారతదేశంలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంలో పలువురికి మార్గదర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం జాతీయ జెండాను ఎగురవేసిన పాఠక్ ఆ వెంటనే కుప్పకూలిపోయాడని సన్నిహితుడు తెలిపారు.
జాతి ఘర్షణలు జరుగుతున్న మణిపూర్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఒక హిందీ చిత్రం ప్రదర్శించబడుతోంది.గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్పూర్ జిల్లాలోని రెంగ్కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించాలని ప్లాన్ చేసింది. అయితే ఆ సినిమా పేరును మాత్రం వెల్లడించలేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తమిళనాడును నీట్ నుండి మినహాయించకపోవడంపై కేంద్రంపై మండిపడ్డారు. విద్యను రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాకు మార్చితేనే NEET పరీక్షను తొలగించగలమని స్టాలిన్ అన్నారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కెనడా పాస్పోర్ట్ను అధికారికంగా వదులుకుని ఆగస్టు 15, 2023న తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన భారత పౌరసత్వానికి సంబంధించిన పత్రాల ఫోటోను అతను ట్విట్టర్లో షేర్ చేసాడు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 10 వ సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కాగా ఈ వేడుకలకు కార్మికులు, రైతులతో పాటు 1800 మందికి పైగా ప్రత్యేక అతిథులు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు , 642 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది.
పబ్జీ గేమ్లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్
ఉత్తరాఖండ్లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.