Seema Haider: చేతబడి చేసిందట, సీమా హైదర్ ఇంట్లో చొరబడ్డ గుజరాతి!

Seema Haider: ఆన్ లైన్ లో ప్రేమించి అక్రమంగా భారత్ కు వచ్చి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సచిన్ మీనాను పెళ్లి చేసుకుంది పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్. ఈవిడ 2023లో భారత్ కు రాగా వారి పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరికి ఒక పాప. పహల్గా దాడి తర్వాత పాకిస్థానీ పౌరులను భారత్ వెనక్కి పంపించే క్రమంలో సీమా కోర్టును ఆశ్రయించింది. అయితే సీమా విషయం ప్రతీది సంచలనమవుతోంది. తాజాగా ఓ గుజరాతి వ్యక్తి సీమా హైదర్ ఇంట్లోకి దూరాడు. తనపై సీమా హైదరీ చేతబడి చేసిందన్నాడు.
గ్రేటర్ నోయిడాలో సీమా హైదర్ ఆమె భర్త సచిన్ మీనా నివసిస్తున్నారు. శనివారం గుర్తుతెలియని వ్యక్తి వీరు ఉంటున్న ఇంట్లోకి చొరబడి గొడవచేయసాగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆ వ్యక్తి గుజరాత్ చెందిన తేజస్ గా గుర్తించారు. మానసిక అనారాగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు. విచారణలో సీమా హైదర్ తనపై బ్లాక్ మ్యాజిక్ చేసిందని చెప్పాడని పోలీసులు అన్నారు. సీమా, సచిన్ లు తనపై చేతబడి చేసి రప్పించిరని ఆరోపించాడు.
పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ కు యూపీకి చెందిన సచిన్ మీనాకు 2019లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారగా 2023లో ఆవిడ తన పిల్లలతో నేపాల్ మీదుగా భారత్ లోకి ప్రవేశించింది. కరాచీలోని తన ఇంటిని 2023 మేలో వదిలివేసింది. జులైలో ఉత్తరప్రదేశ్ లోని బుద్ద నగర్ జిల్లా రబుపుర ప్రాంతంలో ఆవిడ సచిన్ తో కలిసి నివసించసాగింది. అక్రమంగా భారత్ లో ప్రవేశించినందుకు సీమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. పైగా, ఉగ్రవాద నిరోధక దళం దర్యాప్తు కొనసాగుతోంది.
పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లాల్సింది ఆదేశించారు. సీమా తరపు న్యాయవాది మాత్రం ఆవిడ భారతీయ భర్తను కలిగి ఉందని వాదించాడు. పైగా వీరికి ఒక కూతురు కలిగి ఉందని చెప్పాడు. ఉగ్రదాడులతో తన క్లైంట్ కు సంబంధం లేదన్నాడు. తాను భారతీయ కోడలినని భారత్ ను విడిచి వెళ్లనని చెప్పింది సీమా.