Home / తప్పక చదవాలి
ఇటీవల విడుదల చేసిన ట్రయంఫ్ స్పీడ్ 400 బుకింగ్ మొత్తాన్ని రూ.2,000 నుంచి రూ.10,000కి పెంచినట్లు ఆటోకార్ ఇండియా (ఏసీఐ) నివేదించింది. 2.33 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) ధరతో ఈ బైక్ జూలై 5న విడుదలైంది. కస్టమర్లను ఆకర్షించడానికి, స్పీడ్ 400 యొక్క మొదటి 10,000 యూనిట్ల ధర రూ. 10,000 తగ్గింపుతో రూ. 2.23 లక్షలుగా నిర్ణయించారు. బుకింగ్లు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మొదటి 10,000 బైక్లు అమ్ముడయ్యాయి.
ఎలోన్ మస్క్ యొక్క ట్విట్టర్, ఇప్పుడు X గా రీబ్రాండ్ చేయబడింది, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్రియేటర్ల కోసం దాని ప్రకటనల ఆదాయ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. ప్రోగ్రామ్కు అర్హత పొందాలంటే, క్రియేటర్లు తప్పనిసరిగా X బ్లూ (గతంలో ట్విటర్ బ్లూ)కు సబ్స్క్రయిబ్ అయి ఉండాలి. గత మూడు నెలల్లో సంచిత పోస్ట్లపై కనీసం 15 మిలియన్ ఇంప్రెషన్లను కలిగి ఉండాలి. కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి.
అమెరికా శుక్రవారం తైవాన్ కోసం 345 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. చైనా దండయాత్రను అరికట్టడానికి ద్వీపం యొక్క సామర్థ్యాన్ని త్వరగా పెంచడానికి ఇది రూపొందించబడింది.ఇంటెలిజెన్స్, నిఘా మరియు నిఘా పరికరాలు మరియు చిన్న ఆయుధ ఆయుధాలను కలిగి ఉన్న ఈప్యాకేజీ సాధారణం కంటే వేగవంతంగా పంపిణీ చేయడానికి అనుమతిస్తుంది.
ఒక జపనీస్ వ్యక్తి తనను తాను కుక్కగా కనిపించడానికి సుమారుగా రూ.16లక్షలను ఖర్చు పెట్టాడు. టోకో అనే పేరుగల కుక్కగా మారి బయట సంచరించడం ప్రారంభించారు. ఇలా కనపడటానికి అవసరమైన దుస్లులను జపనీస్ కంపెనీ జెప్పెట్ రూపొందించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇక, దీనికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ కు, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు నాయుడేనని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ హయాంలో పోలవరం పనులు 75 శాతం చేసామని చెప్పారని కాని అది అబద్దమన్నారు.
తెలంగాణ హైకోర్టులో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుకి సంబంధించి సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్నీ అబద్దాలే ఉన్నాయని అజయ్ కల్లం పిటిషన్లో తెలిపారు. 2023 ఏప్రిల్ 29న సీబీఐ తన స్టేట్మెంట్ రికార్డు చేసిందని అజయ్ కల్లం చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేల రాహుల్ గాంధీ హర్యానాలోని సోనిపట్ మహిళా రైతులతో తన సంభాషణల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వచ్చిన మహిళా రైతులతో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ సరదాగా ముచ్చటించడం ఈ వీడియోలలో చూడవచ్చు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాలకి చెందిన డికె అరుణని ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్కి కార్యదర్శిగా చోటు దక్కింది.