Home / తప్పక చదవాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏ1గా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు. ఓ ఛానల్ యజమానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాంపల్లి కొర్టులో రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ కొనసాగుతుంది. సమాచారం ధ్వంసం చేయడంలో ప్రభాకర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది.
మ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మే 24కు వాయిదా పడింది .ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే .దీనిపై శుక్రవారం విచారణ జరగాల్సి వుంది . అయితే వాదనలకు మరింత సమయం కావాలని ఈడీ కోరడంతో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు .
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ,ఏపీ ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ర్టలో సుడి గాలి పర్యటన చేస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉత్తర మహారాష్ర్ట లోని నందుర్బార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
అమెరికాలోని న్యూయార్కు నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ గొంతుకు బెల్టు వేసి ఈడ్చుకుంటూ ఓ కారు వెనక్కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన సీసీ కెమరాలకు చిక్కింది. ఒళ్లు గగొర్పొరేడ ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆమ్ ఆద్మీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు కేజ్రీవాల్ వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది.
ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా దేశంలోని హిందువులు, జైనులు అక్షయ తృతీయ రోజును అత్యంత పవిత్ర దినంగా భావిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్బంగా బంగారం కొంటే అదృష్ట కలిసి వస్తుందని నమ్మకం భారతీయుల్లో ఉంటుంది.
సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో ను చూసి ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.