Home / తెలంగాణ
షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. నన్ను వ్యభిచారి అంటావా? అంటూ అంటూ షర్మిల పై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని, కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు గంటలుగా విచారిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక శాఖల కూడా హాజరుకానున్నారు.
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మరోసారి వాయిదా పడింది. బుధవారం సెప్టెంబర్ 28న జరగాల్సిన ఈ కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి సెప్టెంబర్ 26వ సోమవారం నుంచే అధికారికంగా అమల్లోకి వస్తాయంటూ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, వి హెచ్ హనుమంతరావు గట్టుప్పలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటెయ్యాలంటూ అభ్యర్ధించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీటికోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.
5వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దామరగద్ద తహశీల్దారు వెంకటేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో చోటుచేసుకుంది.