Home / ప్రాంతీయం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ 27న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యాత్రలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నిరసనలో బీజేపీ నేతలపై దాడి జరిగిందని, ఆ కారణంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అసౌకర్యాలు వల్ల అక్కడ ఉన్న భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆలయ కోనేరుతో పాటు పరిసర ప్రాంతాల్లో , చెత్త చేదారాల వల్ల భక్తులు రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పైతర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నివసిస్తున్న లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు
తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్ తరపు లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు. రిమాండుకు పంపాలన్నవాదనలను తోసిపుచ్చింది. రాజాసింగ్ అరెస్టు, బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 3 గంటలపాటు వాదనలు జరిగాయి.
సీఎం వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరి 10.35 గంటలకు చీమకుర్తి చేరుకుంటారు. 10:55కు చీమకుర్తి మెయిన్రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి,
బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు . మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.