Home / ప్రాంతీయం
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులవద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. ఈ పదవికి ప్రతిపక్షం పోటీ పడనందున కోలగట్ల ఏకగ్రీంగా ఎన్నిక కానున్నారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సెటైర్లు వేసారు. 74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్లో కలిపేందుకు వచ్చారు.
ఏపిలో మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా శనివారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది.
తెలంగాణ రాష్ట్ర వాప్యంగా సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా ఇటు తెరాస, భాజపా అటు కాంగ్రెస్ పార్టీలు ఈ వేడుకలను జరుపుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో జాతీయ జెండా తిరగబడింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేయగా తలక్రిందులుగా ఎగిరింది.
తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 75వ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య చైతన్య దీప్తి తెలంగాణ చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని, అన్ని పార్టీలు భయపడ్డాయి కానీ ఈ ఏడాది ప్రధాని కృషితో భాగ్యనగరంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్షా అన్నారు.
నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పౌలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.