Home / ప్రాంతీయం
ఈ నెల 5 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని పట్టణంలోని మార్కెట్ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో సొంత నేతలపైనే చిందులు వేస్తున్నాడంటూ సెటైర్లు వేసారు.
జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని, జనసేనను ప్రజలే కాపాడుకుంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే నేను రోడ్డుమీదకు రాలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను రోడెక్కడం తప్పదని పవన్ హెచ్చరించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్నించారు. అన్నక్యాంటీన్ కు అడ్డుపడటం చూస్తే జగన్ లో మానవత్వం లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమిచేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు విరిగిన గేటుని పరిశీలించిన అంబటి ప్రాజెక్టులపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్షీట్ విడుదల చేసింది.
వైఎస్ చనిపోవడానికి 12 రోజుల ముందే పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులన్నీ వచ్చాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. గోదావరి నీటితో కోస్తాంధ్రని, కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలుగన్నారని అన్నారు.
షేక్పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సుజాత జైల్లో ఉండగానే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.