Home / ప్రాంతీయం
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోమవారం మరణించారు. కాగా నేడు ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు నేటితో ముగిసాయి. అక్టోబర్ 4న ప్రారంభమైన వారోత్సవాలు నేటితో పూర్తి అయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జరిగిన ముగింపు వేడుకలలో ఐఐటి డైరెక్టర్ సత్యన్నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ మాట్లాడే మాటలు, బ్రోకర్ మాటలుగా భాజపా శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో హుషారుగా, జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఈటెల సీఎం కేసిఆర్ పరిపాలన తీరును ప్రజలకు తెలియచేస్తున్నారు.
మూడు రాజధానుల మంట ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా అస్త్రాలను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ బాబాయి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తాజాగా మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని పేర్కొన్నారు
తెలంగాణ బీజేపీలో రేసులోకి మరో వారసురాలు వస్తున్నట్లే కనిపిస్తోంది. సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వారసురాలు రాజకీయం రంగంలోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల మేరకు, నున్న ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేశాడు.
మునుగోడు ఉప ఎన్నికలో తెరాస నేతలు ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తున్నారు. కోడి, మద్యం పంపిణీ చేసిన తెరాస నేతల ఘటన మరవకముందే ఏకంగా మంత్రి మల్లారెడ్డే స్వయంగా గ్లాసులో మద్యం పోసి తాగించిన యవ్వారం నెట్టింట హల్ చల్ చేస్తుంది