Home / ప్రాంతీయం
Tiruchanoor Padmavathi Brahmotsavam: ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో […]
Prajapalana Celebrations Review by CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం దీనిపై తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు ఏమిటనేది వివరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ ఉత్సవాలలో అన్ని […]
RSS Chief Mohan Bhagwat Speech in Lokmanthan Bhgyanagar At Hyderabad: భిన్నత్వంలోనే ఏకత్వాన్ని దర్శించటం భారతీయ సంస్కృతి గొప్పదనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో గత 4 రోజులుగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమపు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, గజేంద్ర షెకావత్ తదితరులు హాజరైన ఈ […]
Hyderabad in Danger Zone With the High Polution:హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ రాజధానిలోని దుస్థితే ఇక్కడా ఎదురుకాక తప్పదని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా, ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి, తగిన నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే రాజధాని జనావాసానికి పనికి రాకుండా పోతుందని వారు వివరిస్తున్నారు. 300 దాటిన ఏక్యూఐ హైదరాబాద్ నగరంలో ఆదివారం గాలి నాణ్యత ఒక్కసారిగా తగ్గిందని, ఎయిర్ క్వాలిటీ […]
Notices To YSRCP Social Media Activists: వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర నేతలు సజ్జల భార్గవ్, అర్జున్రెడ్డితోపాటు మరో 15మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులు విజయవాడలోని సజ్జల భార్గవ ఇంటికి వెళ్లగా, ఇంట్లో లేకపోవడంతో భార్గవ తల్లికి నోటీసులు అందజేశారు. […]
Indian Railways Invites Tenders For Visakha Railway Zone: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం కూడా ఏపీపై ఫోకస్ చేస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగుపడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, […]
Indiramma Housing Committees: తెలంగాణలో ఇళ్లులేని పేదలందరికీ ఇందరిమ్మ పథకం కింద కట్టిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీనిచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఖాళీ జాగాఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని చెప్పింది. ఖాళీ స్థలం లేనివారికి జాగాతో పాటుగా రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను […]
Farmer Couple Attempt Suicide in Suryapet: క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్ నిర్వాహకులు తిప్పి పంపారు. దీంతో నిరసిస్తూ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి […]
Nara Lokesh Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చిక్కీల్లో కూడా నిధులు గోల్ మాల్ చేసి.. సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని […]
Police Notices To BRS MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ వివాదంలో ఉండే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఓ విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 9వ తేదీన పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హుజురాబాద్ చౌరస్తాలో దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా చేసేందుకు కౌశిక్ రెడ్డి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని […]