Home / ప్రాంతీయం
AP Dy CM Pawan Kalyan meets PM Narendra Modi in Delhi: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన మూడవ రోజూ బిజీబిజీగా సాగింది. తన పర్యటనలో భాగంగా ఆయన బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని పవన్.. ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా […]
Minister Tummala Nageswara Rao Clarity On Rythu runamaffi: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాఫీ కాలేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికీ రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా […]
Fly Ash Controversy cm chandrababu warning: రాష్ట్రంలో ఏ వ్యక్తులైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ అంశంలో సాగుతున్న వివాదంపై సీఎం ఆరా తీశారు. దీనిపై బుధవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, ముఖ్యంగా కూటమి నేతలు ఈ విషయంలో మరింత […]
Ex Minister Harish Rao Sensational Comments On CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా అని సీఎంను ప్రశ్నించారు. ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు […]
AP CM Chandrababu on the Paravada Pharmacity incident: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్ (22) మృతి చెండాడు. మరొకరి పరిస్థితి […]
Deputy CM Bhatti Vikramarka Sensational Comments: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేశామన్నారు. కాంగ్రెస్లో మంత్రులంతా పని మంతులే అని చెప్పారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మీడియా ప్రతినిధులో చిట్చాట్ నిర్వహించి మాట్లాడారు. వాళ్ల లాగే ఉన్నామని కేటీఆర్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై […]
Heavy Rains Alert to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం బలపడింది. ఈ అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లోె వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో నవంబర్ 27 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]
Kavitha urges more backward reservations in caste survey in report to BC panel: బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్, కులగణనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వెంకటేశ్వరరావులను కలిసి కవిత వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి […]
Kaleshwaram Commission Investigation Started From Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్లీ తన విచారణను కొనసాగించనుంది. పదిరోజుల పాటు సాగనున్న ఈ బహిరంగ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ 52 మందిని విచారించటంతో బాటు తదుపరి విచారణకు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే […]
PM Modi to Visit Visakha on Nov 29 Lay Stone For Green Hydrogen Hub: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తలపెట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయటంతో బాటు ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ఆయన విశాఖ ఆంధ్రాయూనివర్సిటిలో ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదీ […]