Home / ప్రాంతీయం
Earthquakes in telugu states: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం 7.27 నిమిషాలకు పలు సెకన్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపలపల్లి, చిర్ల, రంగారెడ్డి, వరంగల్, చింతకాని, భద్రాచలం ప్రాంతాలతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, విశాఖపట్నం, అక్కయ్యపాలెం, తిరువూరు, నందిగామ, పరిసర ప్రాంతాల్లో భూమి […]
CM Revanth Reddy Powerful Speech about hyderabad: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో సీఎం మాట్లాడారు. మెట్రో మా ఘనతే […]
Irregularities of IPS officer Sanjay: ఏపీ సీఐడీ విభాగం మాజీ అధిపతి, ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన సమయంలో ఆ అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లు నిర్ధారించింది. పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. నాటి నేతలకు […]
Harish Rao Fires on CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నమోదైన కేసు విషయమై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై ఎందుకు కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘మిస్టర్ రేవంత్.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులు బనాయిస్తున్నావు’అని మండిపడ్డారు. ‘నువ్వు […]
Ponguleti Srinivasa Reddy says Special App For Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 5న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ప్రారంభించబోతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. […]
YS Vivekananda Reddy Murder Case: కూటమి ప్రభుత్వ ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు పునర్విచారణ మొదలైంది. ఇందులో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి ఒకప్పటి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పోలీసు విచారణ ముమ్మరం చేశారు. విచారణకు రావాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్రెడ్డితో పాటు, కడప ఎంపీ అవినాష్రెడ్డి బాబాయ్ వైఎస్ మనోహర్రెడ్డి, తమ్ముడు అభిషేక్రెడ్డికి నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ ట్రస్ట్ ఛైర్మన్ జనార్దన్రెడ్డి, న్యాయవాది ఓబుల్రెడ్డికి కూడా […]
Pawan Kalyan Meets Chandrababu Naidu: కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ హయాంలో సాగిన అక్రమ రేషన్ దందా నేటికీ కొనసాగుతూనే ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో […]
Manda Krishna Madiga: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జనపై మందకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ తన జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని అన్నారు. దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక […]
AP Metro Rail Project: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల మొదటి విడత డీపీఆర్లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తొలి దశలో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4కి.మీల మేర ఒకటో కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు (5.08కి.మీల మేర) రెండో కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీల మేర) మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. […]
MP Gurumurthy Letter To PM Modi: దేశ రాజధానిలో నానాటికి వాయు కాలుష్యం పెరుగుతుండడం, మరో వైపు శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తెరపైకి కొత్త డిమాండ్ వస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో రెండు సమావేశాలైన దక్షిణ భారత దేశంలో నిర్వహించాలని తిరుపతి ఎంపీ డిమాండ్ చేయడం ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే దేశానికీ రెండో రాజధానిపై అనేక డిమాండ్ లు వస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి రావడంతో […]