Home / ప్రాంతీయం
యూట్యూబ్ చందు గాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనితో సాయి కిరణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ ఛైర్మన్ శ్రీ బండి శ్రీనివాస రఘువీర్, సీఈవో శ్రీ పైడికొండల వెంకటేశ్వరరావు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జనసేనాని దృష్టికి పలు విషయాలను వారు తీసుకువెళ్లారు. తాజా పరిణామలపై చర్చించారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలని ప్రశ్నించని ఆ పార్టీ నేతలు నెమ్మదిగా గళం విప్పడం ప్రారంభించారు. అధినేత నిర్ణయాలని తప్పుబట్టడం మొదలు పెట్టారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అంగీకరించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సామాజిక పెన్షన్లని 2వేల 750 రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి పెంచుతూ కేబినెట్ అంగీకారం తెలిపింది. జనవరి 1నుంచి వీటిని పంపిణీ చేస్తారు.వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పధకాల అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్దిక ఇబ్బందులపై ప్రభుత్వం మానవతా ధృక్పధంతో స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడం సరికాదన్నారు.
అదిలాబాద్ రిమ్స్ కళాశాలలో వైద్య విద్యార్థులు రెండో రోజు బైఠాయించి వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అత్యవసర సేవలు తప్ప మిగతా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. రిమ్స్ డైరక్టర్ జైసింగ్ రాథోడ్ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
యశోదా ఆస్పత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ కు వైద్యలు తుంటి ఎముక మార్పిడి చేశారు. అయితే ఆయనకు ఆరు నుంచి 8 వారాల రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. విశ్రాంతి సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దిక్కులేకుండా మారిందని దీనిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ముఖ్యనేతలతో సమావేశమయి వారికి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కులం, మతాన్ని దాటి వచ్చానని మానవత్వాన్ని నమ్మానని అన్నారు.
కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా గతంలో పాలకులు చేయనివిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ -200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం జగన్ ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా అధికార కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు.ప్రొటెం స్పీకర్ ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు ఆయననుస్పీకర్ స్దానం వద్దకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.