Home / ప్రాంతీయం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేపటినుంచి నాలుగు రోజులపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.
బుధవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు కనీసం 20 వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పోటు కార్మికులకు 10వేల రూపాయల చొప్పు జీతం పెంచాలని ఆదేశించారు.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ప్రధాని మోదీతో రేవంత్, భట్టి ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడులో మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడం మంచిదయిందని అన్నారు. అంతేకాదు సీఎం జగన్ తన కొడుక్కి ఎమ్మెల్సీ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసానని అన్నారు.
నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సైబరాబాద్ పరిధిలో సన్బర్న్ పేరిట నిర్వహించ తలపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షో, సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా పేరు పొంది మెదక్ కేథడ్రల్ చర్చిలో మొదటి ఆరాధనతో వేడుకలను బిషప్ కె. పద్మారావ్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలలో పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు వైసీపీ సానుబూతి పరులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు.
హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రిలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని మంటలు అదుపు చేయడంతో పెనుముప్పు తప్పింది. ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.