Home / ప్రాంతీయం
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు
ఈనెల జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.
హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్లో మంగళవారం పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. ఈ సమయంలో జొమాటో లోగో ఉన్న బ్యాగ్తో నగరంలోని వీధుల్లో ఒక వ్యక్తి గుర్రంపై దూసుకుపోతున్న వీడియో వైరల్గా మారింది. . చిన్న క్లిప్లో జోమాటో డెలివరీ ఏజెంట్ గుర్రంపై చంచల్గూడ వద్దకు ఫుడ్ డెలివరీకి వచ్చినట్లు చూపించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
వైఎస్ఆర్సిపి అధినేత జగన్ పై తీవ్రస్దాయిలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విరుచుపడ్డారు.. తాను చేసిన తప్పు ఏంటో వైఎస్ జగన్ చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. ఐదేళ్ళుగా ఎప్పుడైనా జగన్ ఒక్కసారి అయినా తమని పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు నిలదీశారు.
ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి రాజీనామా లేఖని పంపించారు. ఆయన త్వరలో జనసేనలో చేరనున్నారు. రాజీనామాకు ముందు తన అనచరులతో సమావేశమయిన దాడి అనంతరం సీఎం జగన్ కు తన రాజీనామా పంపించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
మెట్రో,ఫార్మాసిటీలను రద్దు చేయడంలేదని అయితే ప్రజాప్రయోజనాలకోసం స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సందర్బంగా ఈ విషయాలను వెల్లడించారు.
వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగనుందని షర్మిల ప్రకటించారు.
తెలంగాణలో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆబ్కారీ శాఖ పంట పండింది. ఒక్కరోజే మద్యం ప్రియులు దుమ్ము లేపారు. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 313 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.