Home / ప్రాంతీయం
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే.. మెట్రో ప్రయాణాలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, కామన్ పీపుల్స్ అంతా సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవాళ్లకి మెట్రో ట్రైన్స్ మంచి ఆప్షన్గా నిలుస్తున్నాయి.
తెలంగాణలో తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. నిన్న అర్ధరాత్రి వరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించగా.. ఉస్మానియా జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారులు కార్పొరేషన్ యొక్క ప్రత్యేకమైన వాహన ట్రాకింగ్ సిస్టమ్ నెట్వర్క్లోని ‘TGSRTC గమ్యం యాప్’లో అన్ని లగ్జరీ, ఎయిర్ కండిషన్డ్ మరియు ఎలక్ట్రిక్ బస్సులను చేర్చే ప్రక్రియను వేగవంతం చేశారు
వైసీపీని రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదేగతి పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు స్దానిక బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీసీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం.. సంప్రాదాయాలకు విరుద్ధం అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని కలవటం పై ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను సవరిస్తామని మాట్లాడుతూ.. మరో వైపు అందుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యలు చేపట్టిన తన భర్త.. మంత్రి నారా లోకేష్ కు ట్విట్వర్ వేదికగా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గ్రామాలనుంచి అమెరికా వెడితే లోకేష్ అమెరికా నుంచి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ సినీ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు.
సోమవారం సుమారుగా మూడు గంటల పాటు చర్చించిన ఏపీ కేబినేట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్.. అన్నిటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.