Home / అంతర్జాతీయం
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలు ముగిసాయి. అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు.
మెక్సికోలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
ఆత్మహత్యకు యత్నించిన ఒక వృద్ధురాలు ఏకంగా 55 బ్యాటరీలు మింగేసింది. ఆఖరికి వైద్యులు ఆమెకు సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన ఐర్లాండ్ దేశంలో చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ విజృంభిస్తున్న సమయంలో ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులకు పలు సూచనలు చేస్తున్నాయి. అయితే, విదేశీయులతో పాటు ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వారి చర్మాన్ని తాకొద్దని తాజాగా చైనాలోని ఓ ఉన్నతాధికారి హెచ్చరించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
చైనా తూర్పు తీరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ ద్వీపంలో ఆదివారం మరోసారి బలమైన భూకంపం సంభవించింది. తైవాన్లోని యుజింగ్ నగరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:14 గంటలకు భూకంపం సంభవించిందని USGS తెలిపింది.
భారత్ దెబ్బకు చైనా కంపెనీల అబ్బా అంటున్నాయి. ఇన్నాళ్లూ యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో వ్యాపారం సాగించాయి. కాగా తాజా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీల వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమ వ్యాపారం చేస్తున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో బెంబేలెత్తిన కొన్ని చైనా కంపెనీలు భారత్ కు గుడ్ బై చెప్తున్నాయి.
వరుస ప్రమాదాలు చైనాను వెంటాడుతున్నాయి. తాజాగా నైరుతి చైనాలో చోటుచేసుకొన్న ఓ రోడ్డు ప్రమాదంలో 27మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు
చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. దాదాపు 27 మంది ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.