Kishkindhapuri First Glimpse: అహం మృత్యు .. భయపెడుతున్న బెల్లంకొండ హీరో

Kishkindhapuri First Glimpse: టాలీవుడ్ లో ప్రస్తుతం డివోషనల్ కథలు.. లేకపోతే హార్రర్ కథలు బాగా ట్రెండింగ్o ఉన్నాయి. అందుకే కుర్ర హీరోలు ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం హార్రర్ కథతో భయపెట్టడానికి రెడీ అయ్యాడు. తాజాగా శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కిష్కింధపురి.
కౌశిక్ పెగలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లోనే ప్రేక్షకులను భయపెట్టడానికి ప్రయత్నించారు.
కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు.. కొన్ని గొంతులు ఎప్పటికీ వినకూడదు. కొన్ని ప్రదేశాలు ఎప్పటికీ మర్చిపోలేము అంటూ రాసుకొస్తూ సినిమా కథను ఒక్క లైన్ లో చెప్పుకొచ్చేశారు. ఇక వీడియోలో ఒక బంగ్లా.. అందులోకి హీరో, హీరోయిన్లు వెళ్ళడం.. అక్కడ హీరోకు దెయ్యం పట్టడం.. చూపించారు. ఇక చివరి షాట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ దెయ్యం పట్టిన తర్వాత అహం మృత్యు అంటూ అరవడం హైలెట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమాకు సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతోనైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.