Home /Author
గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో నిందితులను విడుదల చేయడంపం మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిని వాళ్లకు విడుదల చేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీకి దేశం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధాన మంత్రిగా లిజ్ ట్రుస్ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ సభ్యుల్లో అత్యధికులు లిజ్ వైపు నిలిచారు. దీంతో రుషి ఆమె కన్నా 32 పాయింట్లు వెనుకబడి ఉన్నారు.
బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, కేంద్ర ఎన్నికల కమిటి ప్రకటించింది. పార్లమెంట్ బోర్డులో కొత్తగా 11 మందికి చోటు కల్పించగా.. కేంద్ర ఎన్నికల కమిటిలో 15 మందికి అవకాశం కల్పించారు.
అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'పుష్ప: ది రైజ్' బ్లాక్ బస్టర్ గా ఎన్నిరికార్డులు సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం ఇపుడు దక్షిణ భారత ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ( సైమా ) 10వ ఎడిషన్ తెలుగు విభాగంలో నామినేషన్ల జాబితాలో ముందుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో లీడర్ 2 సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతోంది. ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహన్ని సమీప భవిష్యత్తులో లీడర్ 2 చేసే అవకాశం గురించి అడిగినపుడు ఆమె స్పందించారు.
భారతి ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ( డాట్ )కి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. షెడ్యూల్ కంటే ముందే 5G స్పెక్ట్రమ్ బకాయిలను సెటిల్ చేసిందని కంపెనీ బుధవారం తెలిపింది.
వరి పంట కోత మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, పంజాబ్ ప్రభుత్వం వరిగడ్డిని కాల్చడాన్ని నియంత్రించడానికి సిద్ధమయింది.పంట అవశేషాల నిర్వహణ (CRM) పథకం కింద ప్రభుత్వం అందించే స్టబుల్ మేనేజ్మెంట్ మెషీన్లు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే 1 లక్షకు పైగా దరఖాస్తులను స్వీకరించింది.
వాట్సాప్ యూజర్ల కోసం పలు ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఇది యూజర్లు తాము డిలీట్ చేసిన మెసేజ్లను తిరిగి పొందేలా చేస్తోంది. మీరు ఎవరికైనా పంపిన సందేశాన్ని అనుకోకుండా తొలగించినట్లయితే, మీరు సందేశాన్ని పునరుద్ధరించవచ్చు.