Home /Author
ఎగువ నుంచి పోటెత్తున్న వరదకు ఉపనదుల సంగమం తోడై గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద తెలంగాణ-మహారాష్ట్రలను కలిపే వంతెనను ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. ప్రాచీన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది.
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్త పాడె మోసారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందని వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి కారుమూరిగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
లార్డ్స్ వేదికగా నేటి సాయంత్రం 5 గంటలకు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని బావిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో రాణించిన భారత్... ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద అబెవర్ధన బుధవారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు. మరోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద రణిల్ విక్రమసింఘే
ట్విట్టర్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై దావా వేయాలని ట్విట్టర్ యోచిస్తోంది. దీనిపై మస్క్ కూడా వ్యంగ్యంగా స్పందించారు. Oh the irony lol అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దావా గురించి మాత్రం అతను ప్రస్తావించలేదు. ట్విట్టర్ తో ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం చేసుకోవడం అటు తర్వాత ఫేక్ అకౌంట్లు
శ్రీలంకలో పాలకుల నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది. దేశాన్ని దోచుకుపోయిన గొటబాయ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుండగా శ్రీలంక సామాన్యుడికి మాత్రం పూటగడవడం కూడా కష్టమైపోయింది. లంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ప్రజల కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిత్యావసర సరకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు బాలీవుడ్లోనూ బాగా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా స్టార్ కిడ్స్, యంగ్ హీరోయిన్లు విజయ్ కోసం పోటీ పడుతుండటం విశేషం. అమ్మాయిలే కాదు, స్టార్ హీరోయిన్లు కూడా విజయ్ అంటే ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ 'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్ దేవరకొండ అంటే తమకు క్రష్ అని బాహాటంగానే చెప్పేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న మరణించాడు. అతని మరణానికి సంబంధించిన డ్రగ్స్ కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) విచారణ జరుపుతోంది, దివంగత నటుడి ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితాని మాదకద్రవ్యాల అలవాటును ప్రోత్సహించినట్లు ఎన్సిబి తన రిపోర్టులో పేర్కొంది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్, మిరాండా
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో రూ. 950 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందజేస్తే తన బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అదేవిధంగా రూ.250 కోట్లను తన ఖాతాల్లో నిర్వహించాలని వివోను కోర్టు ఆదేశించింది. వివో ఈడీ తన మొత్తం పది బ్యాంకు ఖాతాల డెబిట్ స్తంభింపజేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కోర్టును