Home /Author anantharao b
యూపీలోని ఒక పోలీసు అధికారి తన యూనిఫామ్పై బీజేపీ కండువాని ధరించడం సంచలనం కలిగించింది. పురాన్పూర్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అశుతోష్ రఘువంశీ యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా తన స్దానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది. టెస్లా షేర్లు క్షీణించడంతో డిసెంబర్ 2022లో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ తన స్దానాన్ని పోగోట్టుకున్నాడు.
పురుషుల హక్కుల కోసం పోరాడే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ (SIFF)కి చెందిన పురుషుల బృందం టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం బెంగళూరులోని ఫ్రీడం పార్క్లో ప్రత్యేక ‘పూజ’ నిర్వహించింది
ఇరాన్ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే 6లక్షల ఇరానియన్ రియాల్స్కు పడిపోయింది. మూడు రోజుల క్రితం ఐదు లక్షల రియాల్లుగా ఉండగా.. తాజాగా అది మరింత క్షీణించింది
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ను ఏదో ఒక రోజు ఆయన సన్నిహిత సహచరులే చంపేస్తారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇయర్ అనే ఉక్రెయిన్ డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా జెలెన్ స్కీ చేసినట్లు అమెరికాకు చెందిన న్యూస్ వీక్ వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
ఉత్తర కొరియాలో హాలీవుడ్ లేదా విదేశీ చిత్రాలను చూస్తూ పట్టుబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త నిబంధనల ప్రకారం జైలు శిక్షను ఎదుర్కొంటారు.
యునైటెడ్ కింగ్డమ్లోని చాలా రెస్టారెంట్లకు టమాటాలు లేకుండా వంటలు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయాయి, ఎందుకంటే సరఫరా సంక్షోభం కారణంగా తాజా ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది.
ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మళ్లీ తొలగింపులను ప్రారంభించించింది న్యూయార్క్ టైమ్స్ (NYT)లోని ఒక నివేదిక ప్రకారం, ట్విట్టర్ కనీసం 200 మంది ఉద్యోగులను తొలగించింది.
ఇటలీ పడవప్రమాదంలో చనిపోయిన 59 మందిలో 24 మంది పాకిస్థానీలు ఉన్నట్లు భావిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం తెలిపారు.ఆదివారం జరిగిన ప్రమాదంలో 81 మంది బయటపడ్డారు.