Home / latest national news
దేశంలో మూడు రకాల ఆన్లైన్ గేమ్లను ప్రభుత్వం అనుమతించదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. నిషేధించబడే మూడు రకాల గేమ్లలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ మరియు వ్యసనానికి సంబంధించిన గేమ్లు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.ఆన్లైన్ గేమింగ్ కోసం ప్రభుత్వం తొలిసారిగా ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసిందన్నారు.
పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర మరియు రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చారుని విడుదల చేయాలని కోరుతూ హర్యానా రైతులు ఢిల్లీ-హర్యానా జాతీయ రహదారిపై ట్రాఫిక్ను అడ్డుకున్నారు.
మద్యప్రదేశ్ లో 220 నెలల భారతీయ జనతా పార్టీ పాలనలో 225 స్కామ్లు జరిగాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.సోమవారం మధ్యప్రదేశ్లో ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని జబల్పూర్లో ర్యాలీతో ఆమె ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్లోని మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రూప్ డి మరియు గ్రూప్ సి సేవల కింద ఉన్న ఉద్యోగాలకు రేటు పెట్టి అమ్ముకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడయింది.
కోవిన్ పోర్టల్ కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న వారి వివరాలు లీకయినట్టు తెలుస్తోంది. ప్రముఖుల ఆధార్, పాన్ , ఓటర్ ఐడీ కార్డుల సమాచారం మొత్తం టెలిగ్రామ్ లో ప్రత్యక్షం అయింది. తమిళనాడు ఎంపీ కనిమొళి, కార్తీ, పి. చిదంబరం, కేటీఆర్, హర్షవర్ధన్ ల సమాచారం టెలిగ్రామ్ లో దుండగులు అప్లోడ్ చేశారు. దాంతో తృణముల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్) ఎమ్మెల్యే రూపకళ ఆదివారం ప్రభుత్వ బస్సులలో మహిళల కోసం ఉచిత బస్సు సర్వీస్ స్కీమ్ ‘శక్తి యోజన’ ప్రారంభోత్సవం సందర్భంగా కెఎస్ఆర్టిసి బస్సును నడిపారు. ఈ పథకాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం మధ్యప్రదేశ్లో పర్యటించి నర్మదా పూజలు చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఉన్నారు.కర్ణాటకలో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.
పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 34 మంది మరణించగా.. సుమారు 150 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. వర్షాల
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను అందించాలని ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరినట్లు సమాచారం.