Home / latest national news
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై వాప్కోస్ మాజీ సీఎండి రాజిందర్ గుప్తా మరియు అతని కుటుంబ సభ్యులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కేసు నమోదు చేసింది. వీరికి సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఈ నెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సిద్దం చేసాయి. ఈ నేపధ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి వీటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత పఠాన్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుని షారూఖ్ ను, అతని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇపుడు షారూఖ్ పఠాన్ గెటప్ లో పశ్చిమబెంగాల్ మ్యూజియంలో పలువురిని అలరిస్తున్నాడు.
: కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన స్మార్ట్ సిటీస్ మిషన్ గడువును ఈ ఏడాది జూన్ నుండి జూన్ 2024 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.2015లో ప్రారంభించబడిన ఈ మిషన్ జనవరి 2016 నుండి జూన్ 2018 వరకు పోటీ ప్రక్రియ ద్వారా 100 నగరాలను ఎంపిక చేసింది.
2019 నాటి ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులోకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్పై గుజరాత్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును వెలువరించనున్నారు. అయితే అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.
దేశంలోని మొత్తం 62 ఆర్మీ కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కంటోన్మెట్ పరిధిలోని పౌర ప్రాంతాలను మునిసిపల్ బాడీలకు అప్పగిస్తామని, ఆర్మీ ఏరియాను మిలటరీ స్టేషన్లుగా మారుస్తామని ప్రభుత్వం తెలిపింది.హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని పిట్చర్స్క్యూ యోల్ కంటోన్మెంట్ హోదాను కోల్పోయిన మొదటి పట్టణంగా నిలిచింది.
దర్శకుడు సుదీప్తో సేన్ యొక్క హిందీ చిత్రం, ది కేరళ స్టోరీ.. గత సంవత్సరం టీజర్ను విడుదల చేసినప్పటి నుండి వార్తలలో ఉంది. మే 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది.
అయోధ్యలో 28 ఏళ్ల ఆలయ పూజారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. స్దానిక నరసింహ ఆలయ పూజారి రామ్ శంకర్ దాస్ తన ఆత్మహత్యాయత్నాన్ని ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పోలీసుల వేధింపుల వల్లే తానుఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు.
ఢిల్లీ రోహిణి కోర్టు కాల్పుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా మంగళవారం తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడంతో మరణించాడు. పధకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలోని ఒక మార్చురీలో పనిచేసే మహిళ, ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తికి 20 బాక్సుల మానవ శరీర భాగాలను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కాన్సాస్కు చెందిన కాండేస్ చాప్మన్ స్కాట్, ఒక మెడికల్ స్కూల్ నుండి పుర్రె, ఎముకలు మరియు దంతాలను దొంగిలించి, వాటిని పెన్సిల్వేనియా వ్యక్తికి $11,000కి విక్రయించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.