Home / janasena chief pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రతిసారీ చెట్లని కొట్టివేస్తుండటంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించమని వాలంటీర్లకు ఎవరు చెప్పారంటూ పవన్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో చెలరేగారు. ఈ మేరకు మూడు ప్రశ్నలకు జగన్
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై విరుచుపడుతున్న జనసేనాని ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటికి సరైన సమాధానం చెప్పలేని ప్రభుత్వ పెద్దలు పవన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో డీఎస్సీ, బైజూస్ ట్యాబ్ లపై ట్విట్టర్ వేదికగా సర్కార్ ను నిలదీసారు.
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సర్కారు పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యారు. కాగా ఇప్పుడు తాజాగా పవన్ కు మద్దతుగా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కారు.. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక
ఏపీ ప్రజలకి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్న డేటాపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్కి ఓ వీడియోని కూడా ఆయన జత చేశారు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్సిపిపై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్ధంగా ఉండు జగన్ అంటూ జనసేన శతఘ్ని టీం హెచ్చరించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని.. కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ తో 57 మండీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమం లోనే పొత్తుల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. కాగా అధికార పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వైకాపా నేతలు చెబుతుండగా.. ప్రతిపక్షం లోని తెదేపా, జనసేన పార్టీలు వారి వారి శైలిలో ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నారు.
రేపు జరగబోయే ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రైమ్9తో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తోపాటుగా ఎన్డి పాలసీలని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలన్నదానిపై చర్చించే అవకాశాలున్నాయన్నారు. ఏపీ ఎన్నికలపై కూడా ఎన్డిఎ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారు.
శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు అని వారి హక్కులను కాలరాసే విధంగా శ్రీకాళహస్తి సీఐ ప్రవర్తించడం సమంజసం కాదని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు తప్పు జరిగితే నిలచేసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు
జనసేన అధినేత నేడు తిరుపతికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అందుకు గాను ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి చేరుకున్నారు.