Home / floods
కెన్యాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రాంతంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ కూలిపోయింది. దీనితో వరదలు సంభవించి రహదారులు ధ్వంసమవడమే కాకుండా 45 మంది మరణించారు. ఈ సంఘటన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డ్యాములు, రిజర్వాయర్లను తనిఖీ చేయాలని అంతర్గత మంత్రి కితురే కిండికి అధికారులను ఆదేశించారు.
కుండపోత వర్షాల కారణంగా రియో డి జెనీరోలో 11 మంది మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపింది.తుఫాను ప్రభావంతో రియోలోని ఉత్తర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, విద్యుదాఘాతాలతో ప్రజలుమరణించారు. పెద్ద సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అవెనిడా డి బ్రెసిల్లోని కొన్ని ప్రాంతాలలో కార్లు నీటిలో తేలాయి.
కుండపోత వర్షాల ఫలితంగా తలెత్తిన వరదలతో సోమాలియా, కెన్యాలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు నుండి వరదలతో సుమారుగా 50 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1.2 మిలియన్ల మందికి పైగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవగా దక్షిణ సోమాలియాలోని గెడో ప్రాంతంలో పౌర, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగింది.
:చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల పర్వత ప్రాంతాలలో వరదల కారణంగా 11 మంది మరణించగా, 27 మంది తప్పిపోయారు.నాల్గవ రోజు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలప్రజలను పాఠశాల జిమ్లకు తరలించాలని అధికారులు ఆదేశించారు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది.
నైరుతి చైనాలోని పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా కనీసం 15 మంది మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, 31 మిలియన్ల విస్తారమైన పర్వత ప్రాంతమైన చాంగ్కింగ్లో మధ్యాహ్నానికి మరో నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు తెలిసింది.
ఉత్తర మరియు పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ నిర్వహణలోని రువాండా బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ (ఆర్బీఏ) తెలిపింది.నిన్న రాత్రి కురిసిన వర్షం ఉత్తర మరియు పశ్చిమ ప్రావిన్స్లలో విపత్తుకు కారణమైందని ఆర్బీఏ తన వెబ్సైట్లో తెలిపింది.
కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.