Last Updated:

Congo : కాంగోలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 100 మంది మృతి

కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.

Congo : కాంగోలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 100 మంది మృతి

Congo : కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు. మరిన్ని మృతదేహాల కోసం అధికారులు ఇంకా వెతుకుతున్నారని ప్రధాని జీన్-మిచెల్ సమా లుకొండే తెలిపారు.

వరదల కారణంగా దెబ్బతిన్న కిన్షాసాలోదాదాపు 12 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. న్గాలీమా ప్రాంతంలో మూడు డజనుకు పైగా ప్రజలు మరణించారు మరియు మృతదేహాలను ఇంకా లెక్కించబడుతున్నాయని ఆ ప్రాంత మేయర్ అలిడ్’ఓర్ ట్షిబండా తెలిపారు. పట్టణంలోని మరో ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మరణించారు.

అధికారిక అనుమతి లేకుండా ప్లాట్లలో నిర్మించిన ఇళ్లలో చాలా వరకు విధ్వంసం జరిగినట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవు. వారిని అక్కడనుంచి పంపించినా మరలా తిరిగి వస్తారు అని అనధికార గృహాలను నిర్మించే వ్యక్తుల గురించి మోంట్-నగఫులా మేయర్ డియుమెర్సీ మైబాజిల్వాంగా అన్నారు.2019లో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో కిన్షాసా మరియు చుట్టుపక్కల 32 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి: