Home / ap news
New Uniform Of AP Govt School Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన డ్రెస్సుల కలర్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందించనుంది. ఇందులో భాగంగానే, కొత్త యూనిఫామ్లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఏ […]
AP Assembly Session 2025: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సభ ప్రారంభమైంది. ఇందులో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ తప్పుబట్టారు. కొత్త జిల్లాలకు చట్టబద్ధత ఏంటని ఆయన ప్రశ్నించారు. పేరుకే 26 జిల్లాలు చేశారే తప్పా ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. స్థానికత విషయంలో విద్యార్థులకు సమస్య వస్తోందని వివరించారు. అలాగే, కొత్త జిల్లాల […]
AP BJP MLA quota MLC candidate Somu Veerraju: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. బీజేపీలో సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు నేడు కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, ఏపీలో నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ గడువు ముగియనుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు […]
Janasena leader Nagababu assets values: జనసేన నేత నాగబాబు పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అంతకుముందు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు ఏ పదవి వస్తుందనే విషయంపై జోరుగా చర్చ జరిగింది. కానీ చివరికి ఆయనను మండలికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ […]
Minister Narayana Comments on TDR Bonds in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. ఈమేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. ప్రధానంగా తణుకు, తిరుపతి , విశాఖపట్నంలలో భారీగా స్కామ్ జరిగిందని మంత్రి ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. […]
CM Chandrababu Naidu interesting Comments: కలిసికట్టుగా పనిచేస్తే వికసిత్ భారత్- స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణను విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ మేరకు తెలుగు పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా.. ఇంగ్లిష్ అనువాదక పుస్తకాన్ని నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీకి ఆర్థిక కష్టాలు ఉన్నా ధైర్యంగా […]
Four killed, 20 injured Bus Hits Cement Lorry in Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చోదిమెళ్లలో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ బస్సు ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన […]
Nadendla Manohar comments ration in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ నేతలు మార్చారని విమర్శలు చేశారు. గతంలో […]
Case filed Against YCP MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరు నగరపాలెం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూటమి ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు […]
MLA Quota MLC Candidate Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ కల్యాణ్ సమాచారం అందించారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీకి కేటాయించారు. ఇందులో భాగంగానే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు […]