Home / ap news
Deputy CM Pawan Kalyan wife Anna Lezhneva Konidela Visited Tirumala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్న లెజనోవా తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె స్వామి వారిని దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు […]
Fire Accident in Anakapalle: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండల పరిధిలో ఉన్న కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటినా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]
Road Accident in srishatyasai dist three people died: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో ధనపురం క్రాస్ వద్ద జాతీయరహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. అలాగే వాహనంలో ఉన్న ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను […]
AP Intermediate First and Second Year Results 2025 Released: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 10లక్షలమందికి పైగా పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత వచ్చింది. పరీక్ష రాసిన […]
AP Inter Results 2025 Out Now: విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శర్మ తెలిపారు. అలాగే ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ ఆధారంగా సులువుగా తెలుసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్ […]
Gorantla Madhav Arrested: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్పై మాధవ్ దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలిస్తున్నారు. అయితే మంగళగిరి నుంచి గుంటూరు వరకు […]
AP Government changes in Grama and Ward Sachivalayams: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, 2,500 అంతకంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు సిబ్బంది కేటాయించింది. దీంతో పాటు […]
Police Filed Case On EX MLA Prakash Reddy: వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై కేసు నమోదైంది. జగన్ పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కారణంగా హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాట జరిగిందని, ఈ తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం […]
AP CM Chandrababu Review Meet on State Income: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సొంత ఆదాయ వనరులు పెరిగితేనే నిజమైన వృద్ధి చెందుతుందన్నారు. అయితే,పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచనలు చేశారు. కాగా, రాష్ట్ర ఆదాయం రూ.1.37 లక్షల కోట్ల లక్ష్యం ఉండగా.. […]
AP Deputy CM Pawan Kalyan Launched “Adavitalli Path” from Today: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ‘అడవితల్లి బాట’ పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఆయన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని […]