Home / Andhra Pradesh
APPSC Uploaded group-1 Interview Schedule: రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ రెడీ అయింది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ముఖాముఖి పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కాగా ఇటీవల విడుదల చేసిన గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేసింది. దీంతో మొత్తం 182 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి జూన్ 30 వరకు […]
Encounter in Alluri District: దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు ఉదయ్, అరుణగా గుర్తించారు. కాగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉదయ్ ఉన్నారు. అలాగే […]
Economy Park in Andhra Pradesh: సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సర్క్యులర్ ఎకానమీ పార్కులపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చించారు. ‘మెటీరియల్ రీసైక్లింగ్కి అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర […]
Bomb Threat call to Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమేరకు చెన్నై సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో షార్ కేంద్రంలో అధికారులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. శ్రీహరికోటలోని అన్ని ప్రదేశాలను అణువణువునా గాలింపు చేస్తున్నారు. బాంబ్ డిటెక్టివ్ టీమ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేశాయి. చివరికి బాంబు బెదిరింపులు ఫేక్ కాల్ గా […]
CM Chandrababu Visits Visakhapatnam Today: ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుని.. పార్క్ హోటల్ వరకు అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను […]
Andhra Pradesh: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. కాగా పరీక్షల్లో ఫెయిలైన, ఇంప్రూవ్ మెంట్ విద్యార్థుల కోసం మే 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. కాగా జూన్ 12 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రిజల్ట్స్ కోసం స్టూడెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 […]
AP Mega DSC Exams: రేపటి నుంచి ప్రారంభమయ్యే మెగా డీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఆన్ లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షల కోసం మొత్తం 154 కేంద్రాలను సిద్ధం చేశారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షకు […]
Vanamahotsavam At Amaravati: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించనుంది. అనంతవరంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం అక్కడ మొక్కలు నాటనున్నారు. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో […]
SIT Issued Notice On Tirumala Laddu Case: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతి సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వెనుక ఎవరున్నారు. అసలు ఎక్కడ జరిగింది. ఎవరి పాత్ర ఉంది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు […]
AP: ఏపీ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. కాగా మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే అజెండా తయారు చేశారు. సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా నేటి సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే జీఏడీ టవర్ టెండర్లకు […]