New Player in RCB: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఆర్సీబీ టీంలోకి కొత్త ప్లేయర్
Tim Seifert Joins RCB as Replacement for Jacob Bethell in IPL 2025: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ ముందు ఆర్సీబీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జట్టులోకి కీలక ప్లేయర్ వస్తున్నట్లు ప్రకటించింది. జాకబ్ బెతెల్కు టెంపరీరీ రీప్లేస్మెంట్ను ఆర్సీబీ వెల్లడించింది. న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ను తీసుకొస్తుంది. కాగా, టిమ్ సీఫెర్ట్ను రూ.2కోట్లకు ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.
అయితే, జాకబ్ బెతెల్.. రేపు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్లో జరగనున్న మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జాతీయ జట్టులో చేరనున్నారు. మే 29 నుంచి వెస్టిండీస్ , ఇంగ్లాండ్ మధ్య వైట్ బాల్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం బెతెల్ పయనం కానున్నారు. ఇక, సీఫెర్ట్.. 66 టీ20 మ్యాచ్లు ఆడి 1,540 పరుగులు చేశాడు. అంతకుముందు 2021లో కోల్కతా టీంలో ఆడగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు. తాజాగా, ఈ సీజన్లో ఆర్సీబీలోకి వచ్చాడు.
ఈ మేరకు ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీ ఆడే చివరి మ్యాచ్తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు బెతెల్ స్థానంలో సీఫెర్ట్ అందుబాటులో ఉంటాడని వెల్లడించింది.