Home / పొలిటికల్ వార్తలు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గద్దె దించేంతవరకు తాను నిద్రపోయేది లేదని పదే పదే భాజపా పెద్దలపై విరుచుక పడుతూ జాతీయ పార్టీని స్ధాపించేందుకు సిద్ధమైన సీఎం కేసిఆర్ కసరత్తు డిసెంబర్ కు వాయిదా పడిన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికతో పాటు జాతీయ పార్టీ విధి విధానాలపై పూర్తి స్ధాయి ఎన్నికల కమీషన్ కు సమర్పించేందులో ఆలస్యమే కారణంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చిన జగన్ ప్రభుత్వానికి షర్మిల చీవాట్లు పెట్టారు. తెలంగాణ పరిగి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న ఆమె ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. సుదీర్ఘకాలం పాటు పార్టీ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ వారసుడిని ఎన్నుకునేందుకు వేదికను సిద్ధం చేసింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతుంది బీజేపీ. ఇందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.
సీఎం జగన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది.
ఈడీ, బోడీ, ఎవరూ ఏమీ చేయలేరు. ఇది తెలంగాణ అంటూ తొడ కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్యూను సీరియస్గా టేకప్ చేసిన మోదీ సర్కారు. తామేమిటో చేతల్లో చూపించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది
ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడాన్ని ఆయన ఖండించారు. హెల్త్ యూనివర్సిటీ కట్టింది ఎన్టీఆర్ అని, వైఎస్ఆర్కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరదపవార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి జోడో యాత్ర ప్రయోజనంగా మారుతుందని తెలిపారు.
రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది.
కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ బుధవారం ఉదయం బెంగళూరు అంతటా 'PayCM' పోస్టర్లను ఏర్పాటు చేసింది.