Home / జాతీయం
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు.వర్చువల్గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను తెలిపారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్లో వందేభారత్-2 స్పీడ్ ట్రయల్ కోట-నాగ్డా సెక్షన్ మధ్య 120/130/150 మరియు 180 కి.మీగా ఉందని రాసారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల ఆగస్టు 26 నుంచి 75 ఏళ్లు పైబడిన వారు తమ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఉచిత ప్రయాణానికి వారు తమ టిక్కెట్లను ఆగస్టు 26లోపు బుక్ చేసుకున్నట్లయితే ఛార్జీల వాపసు పొందుతారు, 65 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎంపికచేసిన బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలపై 50 శాతం రాయితీని పొందుతారు
తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రతీక్ అనే 13 ఏళ్ల బాలుడు భావోద్వేగాలతో కూడిన రోబోను రూపొందించాడు. అతను తన రోబోకు 'రఫీ' అని పేరు పెట్టాడు మరియు ఇది సాధారణ ప్రశ్నలకు ప్రతిస్పందించడంతో పాటు తిట్టడం మరియు ఇతర మానవ భావాలను అర్థం చేసుకుంటుంది.
ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా డీఎస్పీ కావాలని తను కన్నకలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా రాత్రింబవళ్లు కష్టపడింది. తన పోరాట పటిమకు విధి సైతం తలవంచడంతో కానిస్టేబుల్ అనుకున్నది సాధించింది.
తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఒక ట్రయల్ కోర్టు శుక్రవారం పాజీ ఫారెక్స్ సంస్థల డైరెక్టర్లు కె మోహన్రాజ్ మరియు కమలవల్లికి 27 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 171.74 కోట్ల సామూహిక జరిమానా విధించింది. వీరు రూ. 870.10 కోట్ల మేరకు డిపాజిటర్లనుమోసం చేసారు.
ఇతర పార్టీల నుంచి టికెట్ సాధించి మొత్తం 277 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని..వీరిని కొనడానికి బీజేపీ రూ.5,500 కోట్లరూపాయలు వెచ్చించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.బీజేపీ గుర్రాల కొనుగోలు, అమ్మకాల వల్లనే ద్రవ్యోల్బణం పెరిగిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్తో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతికి సంబంధించి క్లబ్ యజమాని, డ్రగ్స్ వ్యాపారి సహా మరో ఇద్దరిని గోవా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. క్లబ్ వాష్రూమ్లో డ్రగ్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ యొక్క స్వభావం ఇంకా ధృవీకరించబడలేదు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే ఈ డ్రగ్ ఏంటన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.