Home / జాతీయం
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. పదే పదే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హిందూ జనాభా అధికంగా ఉన్న ఏడు గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ సొంత గ్రామాలుగా పేర్కొంది. ఇది మాత్రమే కాదు. 1500 సంవత్సరాల పురాతన దేవాలయం పై కూడా తమదే అని చెబుతోంది.
ప్రత్యేక హోదా అంశమే ప్రధానంగా 2024లో ఎన్నికల అజెండాగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తానాయా అంటే అవుననేలా బీహార్ సిఎం నితీశ్ కుమార్ మాట్లాడుతున్నారు
అతను ఏ లాటరీ టికెట్టు కొనలేదు.. ఆన్లైన్ ట్రేడింగ్ చెయ్యలేదు కానీ కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకుంటున్నారా... బ్యాకింగ్ సేవల్లో పొరపాటు వల్ల ఓ వ్యక్తి ఒక్కరోజు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది.
రానురాను మన దేశంలో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ఆలోచన చేశారు. విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నమీబియా దేశం నుంచి 8 చీతాలను దేశానికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది.
ఢిల్లీలో మద్యం కుంభకోణం పై బిజెపి మరియు ఆప్ మధ్య పోరు చల్లారలేదు. ఈ కుంభకోణంలో ఆప్ పాత్రను నిర్ధారించడానికి బీజేపీ గురువారం స్టింగ్ ఆపరేషన్ వీడియో ను 'కొత్త సాక్ష్యం' గా మీడియాకు సమర్పించింది.
తమిళనాడు దేవాలయాల్లో అశ్లీలత డాన్సులు, సినిమా పాటలకు మద్రాసు హైకోర్టు చెక్ పెట్టింది. ఆలయాల్లో అశ్లీలతకు చోటులేకుండా భక్తి గీతాలే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు నిషేదం విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొనింది
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని ఒక కార్మికుడు యజమాని తనకు చెల్లించవలసిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వలేదంటూ కోటి రూపాయల మెర్సిడెస్ కారుకు నిప్పు పెట్టాడు. రణ్వీర్ అనే కార్మికుడు ఒక ఇంట్లో టైల్స్ అమర్చాడు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పలు బహుమతులు, నగదు ఇచ్చాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు నటీమణులు పేర్లు వెలుగులోకి వచ్చాయి.