Home / జాతీయం
ఇటీవల విడుదలైన నెట్ఫ్లిక్స్ సిరీస్ “ఖాకీ: ది బీహార్ చాప్టర్”కు స్ఫూర్తిగా నిలిచిన “బీహార్ డైరీస్” పుస్తకాన్ని రూపొందించిన బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదయింది.
Kharagpur Shocking Incident : పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ప్లాట్ఫామ్పై టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా షాక్ కి గురి చేస్తుంది. కాగా ఆ సమయంలో బాధితుడు మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో అతడితో
సంతోషంతో కోలాహలంగా ఉండాల్సిన పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో చోటుచేసుకున్నది.
పశ్చిమ బెంగాల్ ప్రైమరీ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోమారు రంగంలోకి దిగింది.
ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.
AAP : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
హిమాచల్ ప్రదేశ్లో అధికార బీజేపీ, కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్ను తాకింది.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్లో 182, హిమాచల్ ప్రదేశ్లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.
బెంగళూరులో మోదీ మసీదు పేరుతో ఒక మసీదు ఉంది. మోదీ అబ్దుల్ గపూర్ అనే వ్యక్తి 1849లో బెంగళూరులోని టాస్కర్ టౌన్లో నివసించారు. పర్షియా మరియు ఇతర దేశాలతో వర్తకం చేసిన ఈ మోదీ సంపన్న వ్యాపారి. ఆ ప్రాంతాన్ని అప్పుడు మిలిటరీ మరియు సివిల్ స్టేషన్ అని పిలిచేవారు.