Home / జాతీయం
హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేణు భాటియా గురువారం ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కైతాల్లోని ఆర్కెఎస్డి కళాశాలలో చట్టం మరియు సైబర్క్రైమ్పై అవగాహన కార్యక్రమంలో భాటియా తన ప్రసంగంలో అమ్మాయిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గాంధీనగర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ( సిడిఆర్ సి ) అహ్మదాబాద్కు చెందిన సర్జరీ ప్రొఫెసర్ అపూర్వ షాకు ఖర్చు మరియు వడ్డీతో సహా పరిహారం అందించాలని ఎయిర్ ఇండియా లిమిటెడ్ని ఆదేశించింది.ఎయిర్ ఇండియా లిమిటెడ్ తన పెంపుడు పిల్లితో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్లేందుకు నిరాకరించడంతో డాక్టర్ షా పరిహారం కోరారు.
పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్లోని తన క్యాంపస్లోని 1.38 ఎకరాల లీజు భూమిలో 13 డెసిమల్స్ భూమిని మే 6 లోగా ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్శిటీ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కు నోటీసులు పంపింది.
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్దీప్ కౌర్ గురువారం లండన్కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. లండన్ వెళ్లే విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కిరణ్దీప్ను కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
తాను చదువుతున్న పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఒక బాలిక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పనులు ప్రారంభించింది.సీరత్ నాజ్ అనే 3వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న తన పాఠశాల పరిస్థితిని పరిష్కరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ వీడియోను రికార్డ్ చేసింది.
హత్యకు గురైన గ్యాంగ్స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు భారత త్రివర్ణ పతాకాన్ని బుధవారం ఉంచడం వివాదాస్పదమైంది. యుపి స్దానిక ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్కుమార్ సింగ్ ‘రజ్జు’జాతీయ జెండాను సమాధిపై ఉంచినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధుమన్గంజ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ) ఉల్లంఘనపై ఆక్స్ఫామ్ ఇండియా మరియు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని దాని కార్యాలయంలో బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ సందర్బంగా సీబీఐ ఢిల్లీలోని ఆక్స్ఫామ్ ఇండియాకు సంబంధించిన నేరారోపణ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది.
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.
2019 పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని, సస్పెండ్ చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ చేసిన అప్పీల్ను సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది.
భారతీయ సైన్యం సిబ్బందికి చైనీస్ భాషలో శిక్షణ ఇవ్వడం కోసం బుధవారం భారత సైన్యం మరియు తేజ్పూర్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఇటీవల కాలంలో చైనా సరిహద్దులో ఎదురవుతున్న సవాళ్ల నేపధ్యంలో ఈ భాషను నేర్చుకోవడం సైనిక సిబ్బందికి ఉపయోగపడుతుందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.