Last Updated:

Dalits : 200 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో తొలిసారిగా దళితుల ప్రవేశం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం పట్టణంలోని 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళిత వర్గాలకు చెందిన ప్రజలు తొలిసారిగా ప్రవేశించారు.

Dalits : 200 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో తొలిసారిగా దళితుల ప్రవేశం

Dalits : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం పట్టణంలోని 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళిత వర్గాలకు చెందిన ప్రజలు తొలిసారిగా ప్రవేశించారు. గత 200 ఏళ్లుగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ప్రజలకు ఆలయంలోకి ప్రవేశం లేదు. సంవత్సరాలుగా అనేక నిరసనల తర్వాత కూడా, వారు తమ ప్రార్థనలు చేయడానికి అనుమతించలేదు.అయితే, జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్‌తో పాటు మరో అధికారి హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ నుండి ఆదేశాలు అందుకున్నారు.

షెడ్యూల్డ్ కులాలను ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.దీంతో సోమవారం పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా గ్రామంలోని దళితులు అధికారులతో కలిసి ఆలయ ప్రవేశం చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది పోలీసులను మోహరించారు గ్రామస్తులు డప్పువాయిద్యాలతో ఆలయంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేశారు.గత 10 రోజుల్లో తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. అంతకుముందు పుదుకోట్టైలోని వెంగైవాయల్ గ్రామంలోని అయ్యనార్ ఆలయానికి షెడ్యూల్డ్ కులాల ప్రజలను కలెక్టర్ కవిత రాము మరియు ఇతర అధికారులు తీసుకెళ్లారు.

దళితుడైన పి.రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ దేవాలయం సుమారు 200 ఏళ్ల నాటిది. దళితులను ఆలయంలోకి రానీయకుండా మొదటి నుంచి నిషేధించారు. గుడి ఊరేగింపుల్లో పాల్గొనడానికి మమ్మల్ని అనుమతించమని గ్రామంలోని కుల హిందువులను మేము పదేపదే అభ్యర్థించాము. కానీ వారు నిరాకరించారు మరియు 2008లో ఆలయ ఊరేగింపును తాత్కాలికంగా నిలిపివేశారు. మేము ఇప్పుడు మా జీవితంలో మొదటిసారిగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము .మా అభ్యర్థనను అంగీకరించినందుకు జిల్లా యంత్రాంగం మరియు పోలీసులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.

దళితులను ఆలయంలోకి రానివ్వకుండా ఆ గ్రామంలో ‘దిక్తత్’ అమలులో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని కోరుతూ దళిత సంఘాలు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించారు. దీంతో కళ్లకురిచ్చి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) ఎస్‌.పవిత్ర డిసెంబర్‌ 27న గ్రామంలోని ఇరువర్గాలతో శాంతి సమావేశం నిర్వహించి ఆలయంలో పూజలు చేయకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని వారికి వివరించారు.

ఇవి కూడా చదవండి: