Published On:

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ సిద్ధం.. మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ సిద్ధం.. మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు

Fish Prasadam Nampally Exhibition in Hyderabad: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈనెల 8, 9 తేదీల్లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. రోగుల కోసం 32 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుండగా.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, అంధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభావర్ పరిశీలించారు. కాగా, చేప మందు పంపిణీ చేసేందుకు 1.50లక్షల చేపపిల్లలను అందుబాటులో ఉంచారు.