Last Updated:

Tipu Sultan’s sword: లండన్ వేలంలో రూ. 143 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం

18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ బెడ్‌చాంబర్ ఖడ్గం లండన్‌లోని బోన్‌హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ అనే వేలం హౌస్‌లో 14 మిలియన్ పౌండ్లకు ($17.4 మిలియన్లు లేదా రూ. 143 కోట్లు) విక్రయించబడింది. భారతీయ వస్తువుకు  వేలంలో ఇది కొత్త  ప్రపంచ రికార్డు.

Tipu Sultan’s  sword: లండన్ వేలంలో రూ. 143 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం

Tipu Sultan’s sword:  18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ బెడ్‌చాంబర్ ఖడ్గం లండన్‌లోని బోన్‌హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ అనే వేలం హౌస్‌లో 14 మిలియన్ పౌండ్లకు ($17.4 మిలియన్లు లేదా రూ. 143 కోట్లు) విక్రయించబడింది. భారతీయ వస్తువుకు  వేలంలో ఇది కొత్త  ప్రపంచ రికార్డు.

బ్రిటిష్ జనరల్ చేతికి టిప్పు ఖడ్గం..(Tipu Sultan’s sword)

బోన్‌హామ్స్ పత్రికా ప్రకటన ప్రకారం, కత్తి సుమారు 1,500,000-2,000,000 పౌండ్లుగా అంచనా వేయబడింది. పాలకుడితో వ్యక్తిగత అనుబంధం నిరూపితమైన ఆయుధాలలో కత్తి చాలా ముఖ్యమైనదని బోన్‌హామ్స్ అన్నారు.ఇప్పటికీ ప్రైవేట్ చేతుల్లో ఉన్న టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన అన్ని ఆయుధాలలో ఈ అద్భుతమైన కత్తి గొప్పది. అత్యుత్తమ హస్తకళ దానిని ప్రత్యేకమైనదిగా మరియు అత్యంత అభిలషణీయంగా చేసింది అని బోన్‌హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ హెడ్ మరియు వేలం నిర్వాహకుడు ఆలివర్ వైట్ అన్నారు. టిప్పు సుల్తాన్‌ను చంపిన తర్వాత, అతని ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బైర్డ్‌కు అతని ధైర్యానికి చిహ్నంగా సమర్పించినట్లు వేలం సంస్థ తెలిపింది.

టిప్పు సుల్తాన్ 1782లో తన తండ్రి తర్వాత దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి పాలకుడిగా నియమితుడయ్యాడు. అతను తన సాహసానికి గాను ‘టైగర్ ఆఫ్ మైసూర్’ అనే బిరుదు సంపాదించాడు. ఈస్ట్ ఇండియన్ కంపెనీకి వ్యతిరేకంగా యుద్ధాలలో రాకెట్లను  ఉపయోగించాడు. అతని పాలనలో కొత్త క్యాలెండర్ మరియు నాణేల వ్యవస్థ మరియు ఇతర పరిపాలనా మరియు ఆర్థిక సంస్కరణలు చేపట్టాడు.