Home / అంతర్జాతీయం
ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. తొలి సెషన్కు హాజరయ్యారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోవియట్ శకం నాటి మదర్ హీరోయిన్ టైటిల్ అవార్డును పునరుద్ధరించారు. పదిమంది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లిని పుతిన్ ఈ అవార్డుతో సత్కరిస్తారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు రష్యా తెలిపింది.
ఐక్యరాజ్యసమితి విడుదల చేసినవరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2022 నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా నేడు 8 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లు, 2050లో 9.7 బిలియన్లు మరియు 2100లో 10.4 బిలియన్లు పెరుగుతుందని అంచనా వేయబడింది.
ప్రపంచంలో ఎన్నో మర్మప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఇప్పటికీ సైంటిస్టులకు అందని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి తమిళనాడు మహాబలిపురంలో ఒక కొండపై ఏటవాలుగా, జారిపోయేలా ఉన్న రాయి కూడా ఉంది. దీనిలో విశేషమేమంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ రాయిమాత్రం ఇసుమంతైనా కదల్లేదని అక్కడి స్థానికులు అంటున్నారు. ఇక ఇదే తరహాలో మయన్మార్లో కూడా ఒక రాయి ఉంది.
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు.
యాపిల్ సహవ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులు దాదాపు $220,000కి అమ్ముడయ్యాయని వేలం సంస్థ తెలిపింది. 1970ల మధ్యకాలం నాటి "బాగా ఉపయోగించిన" ఈ చెప్పుల కోసం వేలంలో అత్యధిక ధర
జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 10,000 మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టడాన్ని ఆపేసినట్లు, గతవారం అమెజాన్ ఓ ఉన్నతాధికారికి పంపిన అంతర్గత మెమో ద్వారా తెలిపింది.
సాధారణంగా మనం ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు లేదా మనకు కావాల్సిన వారు డల్ గా ఉన్నప్పుడు కౌగిలితో వారికి ధైర్యం చెప్పడం లేదా మన సంతోషాన్ని పంచుకోవడం చేస్తాం. అయితే ఇదో మంచి వైద్య థెరపీ అని ఇలా చెయ్యడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని ఎవరికైనా తెలుసా. ఓ మహిళ తాను ఇతరులను కౌగిలించుకున్నందుకు గంటకు అక్షరాలా 12,000 రుపాయలు వసూలు చేస్తుంది. కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం.