Home /Author anantharao b
శ్రీకాళహస్తి ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం సీరియస్ అయ్యింది. జనసేన నాయకుడిపై సిఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కధనాలను.. సుమోటోగా తీసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలని సిఐ అంజూయాదవ్.. డిఎస్పీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద నదీ ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. యమునా నది నీటి మట్టం 207.62 మీటర్లుగా నమోదయింది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 11 గంటలకు యమునా నది నీటిమట్టం 207.43 మీటర్లుగా నమోదైంది.యమునా నది నుండి నీరు నగరంలోకి రావడం ఆగిపోయింది. దీనితో నగరంలోని కీలక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది.
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్ పార్లమెంట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పారిస్లోని బాస్టిల్ డే పరేడ్లో గౌరవ అతిథిగా ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు. దౌత్య పర్యటనలో ఇరుపక్షాల మధ్య బహుమతుల మార్పిడి జరిగింది
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్లో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులకి బాధితుడు సిద్దార్థ్ దాస్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు సీరియల్ నటుడు మనోజ్ సెలబ్రిటీ క్లబ్ రిసార్ట్స్లో ఒక విల్లాలో సిద్దార్థ అనే వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్ మరియు అతని కుటుంబం నెలలో 13,000 టొమాటో క్రేట్లను (బాక్సులు) విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు.
ఆంధ్రప్రదేశ్ ను జగన్ అనే జలగ పట్టి పీడిస్తోందని జనసేన అధినేతన పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ అవినీతి, అరాచకాన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఒక కులం పార్టీని, సమాజాన్ని నడపలేదని దోచుకునే వాళ్లకే కాదు అందిరికీ హక్కులున్నాయని అన్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్దలయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) యొక్క క్యాంపస్ లను విదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఆఫ్రికాలోని టాంజానియాలో, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ ను అబుదాబిలో, ఐఐటీ ఖరగ్ పూర్ క్యాంపస్ ను కౌలాలంపూర్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నారు.
బీహార్ లోని బక్సర్లో దక్షిణ భారత వంటకాలను అందిస్తున్న రెస్టారెంట్ దోశతో సాంబార్ను అందించకపోవడంతో వినియోగదారుల కోర్టు ఆగ్రహానికి గురయింది. రూ.140 ధర కలిగిన ‘స్పెషల్ మసాలా దోశ’తో సాంబార్ను అందించనందుకు రెస్టారెంట్కు రూ.3,500 జరిమానా విధించారు.
వాట్సాప్ ఐఓఎస్, మరియు ఆండ్రాయిడ్ పరికరాల కోసం యానిమేటెడ్ అవతార్లను పరిచయం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. యానిమేటెడ్ అవతార్ ఫీచర్ యాప్ యొక్క భవిష్యత్తు అప్డేట్లో చేర్చబడుతుందని భావిస్తున్నారు. వాట్సాప్ డెవలప్మెంట్లను ట్రాక్ చేసే వెబ్సైట్ WABetaInfo ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న Android 2.23.15.6 అప్డేట్ కోసం తాజా వాట్సాప్ బీటా ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది.