Home / Viral News
నేటి సమాజంలోని పెళ్లికి ముందు ప్రేమలు కామన్ అయిపోయాయి. అయితే అది పెళ్లయిన తర్వాత బ్రేక్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లైనాక కూడా చాటుమాటుగా ప్రేయసితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు మరికొందరు. అయితే అది బయటపడిన రోజు భార్యలు చేసే గొడవ అంతా ఇంత కాదు. ఇంక భర్త వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నాడంటేనే రచ్చరచ్చ చేసే భార్యలున్న నేటి కాలంలో ఓ ఆడపడుచు తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుని... భర్తకు ప్రేయసిని ఇచ్చి మరల పెళ్లిచేసింది ఈ భార్యామణి.
వినాయకుడి విగ్రహం పాలు తాగడం... చెట్టు నుంచి పాలు కారడం... వంటి వాటిని మనం వినే ఉంటాం. కాగా వీటిని కొందరు హిందువులు దైవం చేస్తున్న అద్భుతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.
కొందరు వ్యాపారులు చేస్తున్న పనులు చూస్తుంటే పట్టలేనంత కోపం వస్తుంది. అలాంటి వారిని అస్సలు సహించకూదని వారికి తగినబుద్ధి చెప్పాలనిపిస్తుంది. అయితే పానీపూరీ విక్రయించే చిరు వ్యాపారులు కొందరు అందులో మురుగు నీరు కలపడం, హోటళ్లలోని ఆహారపదార్దాల తయారీలో ఉమ్మి, చెమట వేయడం, వంట చేసే దగ్గర శుభ్రత పాటించకపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం. కాగా ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇళ్లన్నాక గొడవలు సహజం. అందులోనూ అత్తాకోడళ్లు అయితే మరి చెప్పనక్కర్లేదు. అత్తాకోడళ్ల మధ్య పచ్చిగడ్డి వేసిన భగ్గుమంటుంది అన్న నానుడి ఊరికే రాలేదండోయ్. కొన్ని కలహాలు కుటుంబాన్ని చీల్చితే, మరికొన్ని ప్రాణాలను కూడా తీస్తుండడం మనం ఇటీవలె కాలంలో చూస్తూనే ఉన్నాం.
యుఎస్లోని నార్త్ కరోలినాలో నివసిస్తున్న ప్యాటీ హెర్నాండెజ్ మరియు ఆమె భర్త కార్లోస్, తండ్రిని గౌరవించడం కోసం తన పిల్లలందరికీ 'సి'తో మొదలయ్యే పేర్లను ఎంచుకున్నారు. ఈ జంటకు ఆరుగురు అబ్బాయిలు మరియు పది మంది అమ్మాయిలు ఉన్నారు.