Home / national
Father shoots daughter to death with gun : ఓ యువతి తన తండ్రికి ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకున్నది. బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుక కోసం భర్తతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి అక్కడికి వచ్చి రివాల్వర్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల తృప్తి, 28 ఏళ్ల అవినాష్ వాగ్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. […]
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. పహల్గాంలో విచారణ ప్రారంభం.. ఉగ్రవాదుల దాడి జరిగిన మరుసటి రోజు నుంచి ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణను ప్రారంభించాయి. ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఈ రోజు రెండు మ్యాచులు జరగనున్నాయి. రివేంజ్ విక్ కొనసాగుతుండటంతో మొదటి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్, లక్నో జట్లు తలపడుతున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబయి జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మ్యాచ్లో విజయం సాధించిన జట్టు మూడు, నాలుగో […]
Pahalgam terror Attack : పహల్గాంలో పర్యాటకుపై జగిరిన ఉగ్రదాడిలో 26 మంది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళం సిద్ధమైంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడితో భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తన సన్నద్ధతను చాటేందుకు ఇండియన్ నేవీ తాజా పరీక్షలు నిర్వహించింది. […]
former Indian cricketer Sourav Ganguly comments : జమ్ముకాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్తో అన్ని క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో గంగూలీ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాక్తో క్రికెట్ సంబంధాలంటినీ 100 శాతం నిలిపివేయాలని కోరారు. చాలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలను జోక్గా తీసుకోవద్దని […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సన్రైజర్స్తో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసింది. బ్రెవిస్ (42), ఆయుష్(30), దీపక్ (22), రవీంద్ర జడేజా (21) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఓపెనర్ షేక్ రషీద్ (0) తొలి బంతికే ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్ 2, జయ్దేవ్ 2, మెండిస్, షమి తలో వికెట్ తీశారు. […]
United Nations : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి దాడిని హేయమైనదిగా అభివర్ణించింది. జమ్ముకశ్మీర్లో ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం రెండుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు. దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి […]
Sunrisers vs Chennai Super Kings, IPL 2025 43th Match : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టర్నింగ్ పిచ్తో […]
Barmer bridegroom sent back : భారతీయ యువకుడికి పాక్ మహిళతో పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెలాఖరులో వివాహం జరుగాల్సిన ఉండగా, పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి వరుడు అట్టారి క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అయితే పాక్ భారత్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది పెళ్లి కొడుకును తిప్పిపంపారు. దీంతో తన వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియక వరుడు ఆందోళన చెందాడు. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే […]
Arrest : ‘నీట్ యూజీ–2024’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను ఆర్థిక నేర విభాగం బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్ రాజధాని పట్నాలో అరెస్టు చేసినట్లు ఈవోయూ అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. ప్రధాన నిందితుడిగా సంజీవ్ ముఖియా.. నీట్ పేపర్ లీకేజీ కేసులో సంజీవ్ ముఖియా ప్రధాన నిందితుడు కాగా, దీంతో పేపర్ లీకేజీ అంశం బయటపడింది. వెంటనే అతడు పరారయ్యాడు. […]