Home / latest national news
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
ఒడిశాలోని జాజ్పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని రైల్వే అధికారి తెలిపారు.భారీ వర్షం పడటంతో గూడ్స్ కిందకు చేరిన కూలీలు అది అకస్మాత్తుగా గాలులకు కదలడంతో దానికిందే ప్రాణాలు వదిలారు.
ముంబైలో 56 ఏళ్ల వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శరీర భాగాలను కట్టర్తో ముక్కలుగా చేసి, ఆపై కుక్కర్లో శరీర భాగాలను ఉడకబెట్టాడు. ముంబైలోని మీరా రోడ్లో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ప్రముఖ దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 70 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో గీతాంజలి బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందారు. నేషనల్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్లో తొలితరం మహిళా ఇంగ్లిష్ న్యూస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు. వరి క్వింటాలుకు 143 రూపాయల చొప్పున, మూంగ్ దాల్ ( పెసర పప్పు ) క్వింటాలుకు 803 చొప్పున, రాగులు క్వింటాలుకు 268 చొప్పున పెంచారు.
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.
మణిపూర్లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులతో కూడిన అంబులెన్స్ను ఒక గుంపు దారిలో పెట్టి తగలబెట్టడంతో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు అతని తల్లి మరియు మరొక బంధువుతో సహా మరణించాడని అధికారులు తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యారంగంలో సమూల సంస్కరణలు చేసిన ప్రియమైన స్నేహితుడు మనీష్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు.
కుక్కల వాణిజ్య దిగుమతి, వ్యాపారం మరియు విక్రయాలను నిషేధిస్తూ, అలాగే రెస్టారెంట్లలో కుక్క మాంసాన్ని వాణిజ్యపరంగా విక్రయించడాన్ని నిషేధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను గౌహతి హైకోర్టు కొహిమా బెంచ్ కొట్టివేసింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో బుధవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలకు నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడంతో కర్ఫ్యూ విధించారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.