Home / latest crime news
ఇటీవలె కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు వచ్చి నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. దీనితో నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద ప్రహవాం పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దానితో 76 మంది నీటిలో మునిగి మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.
కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి కాళ్లు నరికేశారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటుచేసుకుంది.
తను ప్రేమిస్తున్న అమ్మాయి మరెవరితోనో దుర్గా పూజకు వెళ్లిందని ఓ కిరాతకుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగక ఆమెను రేప్ అనంతరం తన గొంతు కోసి ఆమెను బ్యాగ్ కుక్కి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన అసోంలో చోటుచేసుకుంది.
వైకాపా అసమ్మతి నేత దారుణ హత్యకు గురయ్యాడు. కళ్లల్లో కారం చల్లి 18 చోట్ల వేడకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు దుండగులు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది
ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్లో 12 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోనే చాలామంది చిక్కుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు.
హిందూ దేవాలయాలపై గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోని పురాతన హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఆ దేశమంతటా కలకలం సృష్టిస్తోంది.
ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పగ పెంచుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది.
బాధ్యతగత పదవిలో ఉండి బాధ్యత మరచి ప్రవర్తించాడు. సాయం చెయ్యాల్సింది పోయి నిర్దయగా వ్యవహరించాడు. దివ్యాంగుడని కూడా చూడకుండా అమానుషంగా అతనిపై దాడి చేశాడు ఓ కఠినాత్ముడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబ్ నగర్లో చోటుచేసుకుంది.
ఓ బ్యాంకులో సుమారు రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీకి గురయ్యింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా విస్తుపోయే నిజం వెల్లడయ్యింది. ఆఖరికి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 9కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే. ఈ చోరీ ఘటన మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో బ్యాంక్లో జరిగింది.
దగ్గు, జలుబు సిరప్ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.