Home / latest ap news
రామోజీ సంస్థల అథినేత రామోజీ రావుకు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు హోమ్ శాఖ సీఐడీని అనుమతించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు, డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కుమారుడి పెళ్లి త్వరలో జరగనుంది. అయితే రాపాక తన కుమారుడి వివాహానికి ఏర్పాట్ల విషయంలో ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి కోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. అదే విధంగా వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో రాయించారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొనగా ఏఈ విషాద ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తుంది. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతుంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో దారుణం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న బత్తుల వీరయ్య (45) కన్న కొడుకు కిషోర్ అలియాస్ అశోక్ (25) ను అతి కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతుంది. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి.. గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు
ఏపీలో కొన్నిరోజుల క్రితం ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల నిర్వహణకు వచ్చిన ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పాముకాటుకు గురై కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొన్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కర్నూలు కోర్టు కొట్టేసింది. సాయంత్రం కర్నూలు జైలు నుంచి అఖిలప్రియ విడుదలకానున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయ్యారు.
నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఊహించని విధంగా ఉందని చెప్పాలి. ఒక వైపు నిప్పుల కొలిమిలా మండుతూనే మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వాతావరణశాఖ చల్లటి కబురు ప్రకటించింది. ఇవాళ, రేపట్లో.. నైరుతి రుతుపవనాలు దక్షిణ
ఆంధ్రప్రదేశ్లో పాలిసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ని తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇటీవలే వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు..
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో నేడు తాజాగా విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ లతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నెల 25న విచారణ జరపాలని..