Home / India
2022 చివరి నాటికి భారతదేశంలో 5G మొబైల్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య సుమారు 10 మిలియన్లకు చేరుకుందని ఎరిక్సన్ నుండి ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య 2028 చివరి నాటికి దాదాపు 700 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది, ఇది దేశంలో మొత్తం మొబైల్ సభ్యత్వాల్లో 57 శాతంగా ఉంది.
భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టు గా ప్రకటించిన కెనడాకు చెందిన ఖలిస్థాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ను బ్రిటిష్ కొలంబియాలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. అతను గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది.
డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది.
ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు.
భారత్ మరోసారి ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు వేదిక కానుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు దేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ సుందరి 2023 పోటీలు రానున్న నవంబర్ లో దేశంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
భారత్ మరోమారు సంచలనం సృష్టించింది. ఆసక్తికరంగా సాగుతున్న హాకీ జూనియర్స్ ఆసియా కప్ లో టైటిల్ కైవసం చేసుకుంది. గురువారం జరిగన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇక పోటీ ఏదైనా కానీ భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ ఉంటే ఆ ఆట ఇంకా ఏ లెవెల్లో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 686 కోట్లుగా ఉన్న భారత రక్షణ ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 16,000 కోట్లకు ఎగబాకాయి. 100కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను 85 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయడంతో ఎగుమతులు 23 రెట్లు పెరిగాయి
బీజీఎంఐ ఇపుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని.. వినియోగదారులకు గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యునిల్ సోహ్న్ తెలిపారు.