India Big Warning: భారత్ సంచలన నిర్ణయం.. భవిష్యత్తులో ఉగ్ర చర్య కాదు.. యుద్ధ చర్యనే..!

India Big Warning to Pakistan amid India – Pakistan War: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద చర్యలను దేశంపై యుద్ధంగా పరిగణించనున్న భారత్.. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా దానిని భారత్పై యుద్ధంగానే పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఉగ్రవాద చర్య జరిగినా అందుకు తగినట్టుగానే తీవ్ర ప్రతి చర్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఇక నుంచి ఉగ్ర చర్య కాదు.. యుద్ధ చర్యేనని భారత్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఎవరు నష్టం కలిగించాలని చూసినపప్పటికీ.. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు చేపట్టిన దానిని యుద్ధ చర్యగానే భావించాలని త్రివిధ దళాలకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఏ దేశానివైనా ‘యాక్ట్ ఆఫ్ వార్’గానే భావిస్తామని హెచ్చరించారు. ఇక, టే ఉగ్రవాద సంస్థ అయినా భారత్పైన దాడి చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు.
ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ గత నాలుగురోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అత్యున్నత రక్షణ అధికారులతో రివ్యూలో పాల్గొంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ అర్వైజర్ అజిత్ ధోవల్, అనిల్ సోహన్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాతిపథులతో సమావేశమయ్యారు. తదుపరి చర్యలతో పాటు పాక్ చేస్తున్న దాడులు, భారత రక్షణ సన్నద్ధత, సరిహద్దుల్లో భద్రత, ఉగ్రవాదుల దాడులపై చర్చించారు.